![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap-political-news-telugu-latest-cbn-jagan-pavan-ysrcp-jsp-janasena-tdp66c1f507-208e-451d-9cb0-4b5d97549816-415x250.jpg)
ఇక వైసీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటివారు అయితే ఈపాటికే విశాఖ నుంచే జగన్ పరిపాలిస్తారని, జూన్ 9న విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం ఉంటుందని కూడా వెల్లడించారు. అదే మాదిరి టీడీపీ నేతలు దేవినేని ఉమా, రఘురామకృష్ణరాజు కూటమి అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. దీంతో ప్రమాణస్వీకారం అమరావతికి దక్కుతుందా? లేక విశాఖపట్నానికి దక్కుతుందా? అన్న ఈ రెండింటిలో ఏది ఖాయమవుతుందా అని జనాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సర్వేలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని గట్టిగా చెబుతుంటే.. మరికొన్ని కూటమికి గెలుస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. ఇక ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అయితే వైసీపీకి ఓటమి తప్పదంటూ పలుమార్లు గట్టిగా మీడియా ముందు వాదించి మరీ చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరికి మెజారిటీ స్థానాలు దక్కుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఎదురుచూడక తప్పదు. ఈలోపు మీరు ఒక ఓటరుగా ఏమంటుకుంటున్నారో, ఏ పార్టీ వస్తే మీకు మేలు చేకూరుతుంది అని భావిస్తున్నారో ఇక్కడ కామెంట్ చేయండి.