రోజా:
నగరి నియోజకవర్గం పేరు చెప్పగానే రోజా పేరు గుర్తుకు వస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఈమెకి ఓటమి తప్పదట. దీనికి ప్రధాన కారణం నగరిలో ఆమెకు వ్యతిరేకత ఉందని వైసీపీ క్యాడర్ స్వయంగా జగన్ చెప్పారట. వారు ఈమెకు టికెట్ ఇవ్వద్దని ముందే చెప్పిన జగన్ మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఈసారి ఆమె ఓటమి తప్పదని అంటున్నారు.
అంబటి రాంబాబు:
వైసిపి కీలక నేత అంబటి రాంబాబు కూడా ఈసారి సత్తెనపల్లిలో ఓడిపోయే అవకాశం ఉందట. ఈయనకు సొంత పార్టీ వ్యతిరేకత ఉందట. అక్కడ టిడిపి కూటమి నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఈసారి టిడిపి జనసేన కలుస్తుంది కాబట్టి ఆయన గెలిచే అవకాశం కనిపిస్తోంది.
గాజువాక:
ఈ నియోజకవర్గంలో కూడా గుడివాడ అమర్ నాథ్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
గన్నవరం:
వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు టిడిపి నుంచి గెలిచారు. ఈయన ఈసారి వైసిపి లోకి వచ్చి గన్నవరం నుండి పోటీ చేశారు.కానీ ఈసారి వంశీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తణుకు:
కార్మూరు నాగేశ్వరరావు ఈసారి వైసిపి నుంచి పోటీ చేశారు. ఈయనకు కూడా గెలుపు అవకాశాలు దాదాపుగా లేనట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గోపాలపురం:
హోంమంత్రి తానేటి వనిత ఈసారి గోపాలపురం నియోజకవర్గం లో ఓడిపోతుందని తెలుస్తోంది. ఇక్కడ మద్దిపాటి వెంకట్ రాజుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
గుంటూరు పశ్చిమ:
విడదల రజిని గుంటూరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె కూడా ఈసారి ఓడిపోయా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.