![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/those-who-win-this-election-will-keep-their-victory-momentum-in-toob1f61e36-e25a-48fe-9c30-410c0f90c312-415x250.jpg)
వైసీపీ గెలుస్తుందని కొంత మంది బెట్టింగ్ కాస్తుంటే.... కాదు కాదు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని మరికొంతమంది జోరుగా బెట్టింగ్ చేయడమే కాకుండా ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మొన్న... సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తున్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసి లండన్ కి వెళ్ళిపోయారు.
దీంతో టెన్షన్ లో ఉన్న వైసిపి క్యాడర్... కాస్త రిలాక్స్ అయింది. అటు తెలుగుదేశం పార్టీలో కాస్త టెన్షన్ కూడా మొదలైంది. అయితే తాజాగా నాగన్న సర్వే రిపోర్ట్ కూడా వైసిపి పార్టీకి అనుకూలంగా వచ్చింది. వైసిపి పార్టీకి 118 సీట్లు వస్తాయని నాగన్న సర్వే రిపోర్ట్ లో తేలిందట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు... నాగన్న సర్వే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు జలకు ఇచ్చేలా లండన్ నుంచి కీలక సందేశం పంపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.