జగన్ అష్ట కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి తాడేపల్లిలో నాలుగైదు రోజులు మకాం వేసి మరి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తమ పార్టీకి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ను గెలిపించుకున్నారు. ఇక్కడ జగన్ గెలిపించుకున్నారు అనడం కంటే కూటమీ పార్టీలు దయ‌ద‌ల‌చి ఇక్కడ పోటీ పెట్టలేదు.. దీంతో వైసిపి గెలుపు సులువు అయింది. వాస్తవంగా ఇక్కడ టిడిపి - జనసేన - బిజెపి ఒకే మాట మీదకు వచ్చి ఉప ఎన్నికలలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా పోటీకి పెట్టి గట్టిగా కష్టపడి ఉంటే ఉప ఎన్నికలలో బొత్స సత్యనారాయణ కచ్చితంగా ఓడిపోయి ఉండేవారు. అయితే జగన్ తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలు పెడుతూ వారి గెడ్డాలు పట్టుకుని మరి బతిమిలాడుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు సమీక్షలు పెట్టి ఎలాగైనా బొత్స ను గెలిపించాలని వేడుకున్నారు.


చివరకు చంద్రబాబు .. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులను బలవంతంగా తమ వైపునకు తిప్పుకోవడానికి ఇష్టపడలేదు. అలా బొత్స గెలుపు సులువు అయింది. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు ఐదేళ్ల మంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ నేతగా ఉన్న తనను జగన్ పట్టించుకోకపోవడం బొత్స ను ఎంతో మరోవేదనకు గురిచేసిందట. పైగా ఎన్నికలలో బొత్స కు ఇష్టం లేకపోయినా బొత్స భార్య ఝాన్సీ ని బలవంతంగా విశాఖ ఎంపీగా పోటీ చేయించారు. ఝాన్సీ ఏకంగా 5 లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు బొత్స ఎమ్మెల్సీ అయ్యారు..  బొత్సకు ఎలాగో మరో మూడేళ్ల పాటు ఎమ్మెల్సీ ఉంటుంది. వైసీపీలో ఉండటం కంటే బిజెపిలోకి వెళితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు కూడా బొత్స చేస్తున్నారని బొత్స సన్నిహితుల ద్వారా ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చిందని తెలుస్తోంది. బొత్స పార్టీ మారి బిజెపిలోకి వెళితే ? ఆయనని ఎంతో కష్టపడి గెలిపించిన జగన్కు పెద్ద షాక్ లాంటిదే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: