గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చట్టబద్ధం కల్పించాలని కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించింది. అమరావతి రాజధాని అని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మ సంతకం చేసి విడుదల చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర న్యాయశాఖ ప్రకటన చేసింది.


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం. పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాతే ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది అనంతరం సోమవారం బిల్లును చట్టబద్ధత కల్పిస్తు ఉత్తర్వులను జారీ చేశారు. దీని ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇది కీలక పరిమాణం. ముఖ్యంగా సెక్షన్ 5 లో సవరణలు చేసి కొత్త రాజధాని అనే చోట అమరావతి రాజధానిగా పేర్కొనాలి అంటూ ఈ గెజిట్ తో స్పష్టం చేశారు. దీంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించింది కేంద్రం.

అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం అంటే సిఆర్డిఏ చట్టం ప్రకారంగానే గెజిట్ ఉంటుందంటూ పేర్కొన్నారు. 2024 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చినట్టుగా పొందుపరిచారు. 2024 జూన్ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ కి అధికార రాజధానిగా అమరావతి పిలవబడుతుంది. ఏప్రిల్ ఒకటి రెండవ తేదీన పార్లమెంటు ఉప సభ్యులు అమరావతి చట్టబద్ధత బిల్లుని ఆమోదించారు. సుమారుగా 5 గంటల పాటు లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లు పైన చర్చలు జరిగాయి. దీంతో అక్కడ ఎలాంటి సవరణలు లేకుండానే ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంత ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులకు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: