ఔను.. తెలంగాణలో ఆంధ్రా కుర్రాళ్లు అదరగొట్టేశారు.. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సగం ర్యాంకులు ఆంధ్రా కుర్రాళ్లే కైవసం చేసుకున్నారు. మొదటి పది ర్యాంకుల్లో ఇంజినీరింగ్ విభాగంలో ఆరు.. అగ్రి, ఫార్మా విభాగంలో ఐదు ర్యాంకులు ఆంధ్రా విద్యార్థులు సాధించారు. ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంకును గుంటూరుకు చెందిన గోరంట్ల జయంత్ హర్ష, రెండో ర్యాంకును శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కిల్లారి రాంప్రసాద్, మూడో ర్యాంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటకు చెందిన అవ్వారి సాయి ఎస్ఎస్ వీ భరద్వాజ్ సాధించారు.
ఈసారి తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ లో అబ్బాయిలు సత్తా చాటారు. మొదటి పది ర్యాంకులు బాలురకే దక్కాయి. వ్యవసాయ, ఫార్మా విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో ఏడు బాలురే సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,31,899 మంది పరీక్ష రాయగా... 74.75 శాతం అంటే 98,596 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 59029 మంది అబ్బాయిలు, 39,567 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 73496 మంది పరీక్ష రాయగా... 86.49శాతం అంటే 63570 మంది ఉత్తీర్ణత సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో మొదటి మూడు ర్యాంకులను పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థి కడిమిశెట్టి వీఎన్ వీఎస్, ఒంగోలుకు చెందిన గొల్లమూడి ప్రదీత్ సుందర్ రెడ్డి, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ విద్యార్థి గోటూరి అభినవ్ రెడ్డి సాధించారు. ఈనెల 25, 26 తేదీల్లో ఓఎంఆర్ సమాధాన పత్రాలు.. 28 నుంచి ర్యాంకు కార్డులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
మొదటి పది ర్యాంకుల్లో ఇంజినీరింగ్ విభాగంలో ఆరు.. అగ్రి, ఫార్మా విభాగంలో ఐదు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు.
ఇంజినీరింగ్ లో మొదటి పది ర్యాంకర్లు ర్యాంకు పేరు మార్కులు ప్రాంతం
1 గోరంట్ల జయంత్ హర్ష 156 గుంటూరు
2. కిల్లారి రాంప్రసాద్ 156 రణస్థలం, శ్రీకాకుళం
3. అవ్వారి సాయి ఎస్ఎస్ వి భరద్వాజ 155 అశ్వాపురం, కొత్తగూడం
4. దొడ్డి శైలేంద్ర బత్తిబాబు 155 అమలాపురం, తూగో జిల్లా
5. వి.మోహన్ అభ్యాస్ 155 కూకట్ పల్లి, హైదరాబాద్
6. చాగం దిలీప్ కుమార్ రెడ్డి 155 తాడిపత్రి, అనంతపురం
7. ఎంవీఎస్ఎన్ ప్రణీత్ 155 మాదాపూర్, హైదరాబాద్
8. సత్యం రల్హాన్ 154 కాంచీపురం
9. అబ్దుల్ మొయీజ్ 154 మచిలీపట్నం, కృష్ణా జిల్లా
10. బి.నిఖిల్ 154 మాదాపూర్, హైదరాబాద్