2014 ఎన్నికల సమయంలో దేశమంతటా నమో అంటూ మోడీ హవా స్పష్టంగా కనబడింది. అయితే తీరా ఎన్నికల్లో గెలిచాక ప్రధాని అయ్యాక మోడీ ఏకపక్ష నిర్ణయాలతో తీసుకున్న నిర్ణయాలు ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే మరోపక్క సామాన్యుడి జీవితం పై పెనుభారం మోపిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for subramanian swamy

ఇలా ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని సొంత నేతలకే తలనొప్పిగా మారిన మోడీ సర్కార్ పై దేశంలో ప్రస్తుతం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల బిజెపి పార్టీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాక బీజేపీ పార్టీలో కూడా కలకలం అయ్యాయి.

Image result for subramanian swamy modi

ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Image result for subramanian swamy

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు కూడా అభ్యతరం లేదనీ.. అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్.. యూపిలోని యోగి ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. రామ మందిరాన్ని అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తే ప్రభుత్వాలను కూల్చేందుకు వెనకాడనని సుబ్రహ్మణ్యం స్వామి వార్నింగ్ ఇచ్చారు. దీంతో సుబ్రహ్మణ్యస్వామి చేసిన కామెంట్లు బిజెపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: