కామా తురానాం..నభయం నలజ్జ.. కామంతో ఉన్న వారికి చిన్నా, పెద్ద అనే వయసు తో నిమిత్తం లేకుండా నీచంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా తన కూతుళ్ల ప్రియులతో కామ వాంఛ తీర్చుకున్నందుకు లైటిల్ (41) అనే మహిళను కోర్టుకు హాజరు పర్చడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఆమెకు ఆరేళ్లు జైలు శిక్షను విధించారు..అయితే ఆ ఆరేళ్లు ఆమెకు సరైన శిక్ష కాదని..అంతకు మించి ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు. కాగా, ఈ కేసు విచారణ వచ్చే సోమవారం నాటికి వాయిదా పడింది.
ఈ కేసు 2017 చివర్లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది..ఇక లైటిల్ అనే మహిళ తన కూతుళ్ల బాయ్ ఫ్రెండ్స్ ని మాయమాటలతో లొంగదీసుకొని వారితో కామవాంఛ తీర్చుకుందని..దీనిపై కూతుళ్లు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఒక తల్లిగా ఇలాంటి నీచమైన స్థితికి దిగజారిపోవడం సమాజంలో చెడు సంకేతాలకు దారి తీస్తుందని వారు వాపోయారు. కూతుళ్ల బాయ్ఫ్రెండ్స్ కారులో తులరీ నుండి విసేలియాకు తీసుకెళ్లి అక్కడ వారికి మందు, సిగరెట్లు అందించి అనంతరం శృంగారం చేయాలని బలవంతం చేసినట్టు తెలుస్తోంది.
2017 అక్టోబర్లో లైటిల్ తనతో మూడు సార్లు సెక్స్లో పాల్గొందని ఓ యువకుడు చెప్పారు. లైటిల్పై కేసు నమోదు కావడంతో ఆమె భర్త కూడ విడాకులకు ధరఖాస్తు చేశాడు. ఇక ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. కానీ కోర్టు నిర్ణయించిన శిక్షనే ప్రతిసారీ ప్రొబేషన్ రిపోర్ట్ అనుసరిస్తుందని, కానీ ఈ కేసులో ప్రొబేషన్ రోపోర్ట్ శిక్షను ఖరారు చేసే విధంగా ఉన్నట్టు జడ్జి తెలిపారు.