ఎంతో మంది సెలబ్రిటీలకి అభిమానులు ఉంటారు వారి అభిమానాన్ని ఎన్నో రకాలుగా చాటుతూ ఉంటారు..తాము నచ్చిన స్టార్స్ కోసం గుండ్లు కూడా కొట్టించుకుని వారి పేర్లు రాయించుకుంటారు కూడా అయితే ఇలా  ఎన్నెన్నో వినూత్నమైన పద్దతుల్లో తమ అభిమానాన్ని ప్రేమని చాటుకుంటారు అయితే..తాజాగా జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది..అదేంటంటే

చాలా మంది తారాలకి ,క్రీడాకారులకి అభిమానులు దణ్ణం పెట్టడం మన చూసే ఉంటాము కానీ జూనియర్ సచిన్ గా పిలవబడే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం అందుకు భిన్నంగా అభిమాని కాళ్ళకి పాదాభివందనం చేశాడు..ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది..అభిమాని కాళ్ళకి పాదాభివందనం చేయడంతో తన అభిమానులు వీరు మంచితనాన్ని ,వినయాన్ని తెగపోగిడేస్తున్నారు

 93 ఏళ్ల ఓం ప్రకాశ్‌ అనే  తాత సెహ్వాగ్‌కు వీరాభిమాని. పటియాలకు చెందిన ఆయన మంగళవారం చండీఘడ్‌లో తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఓం ప్రకాశ్‌ కాళ్ళకి వీరు పాదాభివందనం చేశాడు..ఈ ఫోటోని తన ట్విటర్‌ ఖాతాలో ఫోస్ట్‌ చేసింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. సెహ్వాగ్‌ కూడా తన 93 ఏళ్ల సీనియర్‌ అభిమానితో దిగిన సెల్ఫీని దాదా కో ప్రణామ్‌’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: