ఒకప్పుడు భారత జట్టులో తన ఫేస్ బౌలింగ్ తో మెరుపులు మెరుపుంచిన ఇషాంత్ శర్మ..  ఇక టీమిండియా ఆడిన వరల్డ్ కప్లలో మాత్రమే కాదు ఇక ఎన్నో కీలకమైన మ్యాచులలో కూడా జట్టులో భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన అద్భుతమైన బౌలింగ్ తో ఎప్పుడూ ఇండియాను విజయ తీరాల వైపుకు నడిపించేవాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం జట్టులోకి ఎంతోమంది యువ ఫేసర్లు రావడం ఇక ఇషాన్ శర్మ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటంతో చివరికి జట్టు సెలెక్టర్లు చేసేదేమీ లేక అతని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇలా పక్కన పెట్టిన సమయంలో చాలా రోజుల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చినప్పటికీ ఇషాంత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.


 దీంతో చాలా రోజుల నుంచి ఇషాంత్ శర్మకు భారత జట్టులో స్థానం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే కొత్త కొత్త ఫేసర్లు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో ఇక ఇషాంత్ శర్మ గురించి ఆలోచించేందుకు అటు సెలెక్టర్లకు కూడా టైం లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమైన ఇషాంత్ శర్మ ఇక ఐపీఎల్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది జరిగిన మెగా వేలంలో అతని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అన్ సోల్డ్ ఆటగాడిగానే మిగిలిపోయాడు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తాను ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోవడం.. ఇక భారత జట్టులో చోటు కోల్పోవడం పై స్పందిస్తూ..  జట్టులో చోటు, ఐపీఎల్ గురించి తాను ఆలోచించడం ఎప్పుడో మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు ఇశాంత్ శర్మ. ప్రస్తుతం తాను ఆనందంగానే ఉన్నానని.. ఇక చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నాను అంటూ ఇశాంత్ శర్మ చెప్పుకొచ్చాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: