
దీంతో దశాబ్ద కాలానికి పైగా నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉండగా ఈ నిరీక్షణకు తెరపడుతుంది అనుకుంటే అలా జరగలేదు. ఈ క్రమంలోనే 2024 టీ20 ప్రపంచ కప్ గురించి ఇక ఇప్పటినుంచే బీసీసిఐ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీమిండియా కు ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు భిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు. ఇంగ్లాండు మేకల్లమ్ ను కోచ్ గా నియమించుకుంది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రతో మనం కూడా ప్రయోగం చేయవచ్చు. ఆశిష్ నెహ్ర కోచింగ్ లోనే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. కాబట్టి టి20 కాన్సెప్టును ఆ ఫార్మాట్ అవసరాలను గుర్తించే వారిని ప్రత్యేకంగా కోచ్గా నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దృష్టి అంత టి20 పైనే ఉంది. పొట్టి ఫార్మట్ లో భారత జట్టు ఛాంపియన్గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రకు బాగా తెలుసు. ఇక టెస్టులు వన్డేలలో టీమిండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు రాహుల్ ద్రవిడ్ వద్ద ఉన్నాయి అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.