అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఇక రెండో రోజు కూడా ఆస్ట్రేలియాదే పైచేయిగా నిలిచింది.ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా,కెమెరాన్ గ్రీన్  క్రీజులో  ఉండి ఇండియన్ బౌలర్ లని ఊచకోత కూయిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఏకంగా 200ల భాగస్వామ్యం నెలకొంది. ఇక ఆసిస్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆసిస్ బ్యాట్స్‌మెన్స్ నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి వచ్చారు.రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో బౌలర్లకు వికెట్ నుంచి పెద్దగా సాయం లభించకపోవడంతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్స్ ఆధిపత్యం ప్రదర్శించారు. లంచ్ వరకు ఖవాజా, గ్రీన్ కలిసి జట్టు స్కోరును ఏకంగా 347/4కు తీసుకెళ్లారు. ఉస్మాన్ ఖవాజా మొత్తం 150 పరుగులు పూర్తి చేయగా, ఇక కామెరాన్ గ్రీన్ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


ఈ సెషన్‌లో  92 పరుగులు చేయగా, ఇండియాకి వికెట్ దక్కలేదు.ఇక ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 38, ట్రావిస్ హెడ్ 32, పీటర్ హ్యాండ్‌కాంబ్ 17, మార్నస్ లబుషెన్ 3 పరుగుల వద్ద ఔటవ్వడం జరిగింది.ఇక ఇండియా తరపున మహ్మద్ షమీ అత్యధికంగా 2 వికెట్లు తీశాడు. ఇంకా అలాగే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో 1 వికెట్ ని పడగొట్టడం జరిగింది.ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (157 పరుగులు), కెమెరాన్ గ్రీన్ (111 పరుగులు) క్రీజులో ఉన్నారు. ఇక వీరిద్దరి మధ్య 200ల భాగస్వామ్యం నెలకొంది. ఆ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్లకు మొత్తం 374 పరుగులు చేసింది.అయితే ఇండియా బౌలర్ల చెత్త ప్రదర్శన పై టీం ఇండియా అభిమానులు విరుచుకుపడుతున్నారు.సొంత గడ్డపై ఇలాంటి చెత్త ప్రదర్శన చేస్తునందుకు ఇండియన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరి చూడాలి మన బౌలర్లు మున్ముందు రోజుల్లో ఎలాంటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: