పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహణపై రాజుకున్న వివాదం సద్దుమణిగింది  అనుకునే లోపే.. మళ్ళీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఎవరో ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదం మరింత తీవ్రతరం అయ్యేలా చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని.. కేవలం తటస్థ వేదికపై మ్యాచ్ లు జరిగితేనే తాము ఆసియా కప్ లో ఉంటామని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై స్పందించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇక ఇరు జట్ల మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇక కొంతమంది పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం వివాదం మరింత పెరిగిపోయేలా చేస్తున్నాయ్ అని చెప్పాలి.



 కాగా ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి మేనేజర్ అయిన వసీమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలతో మళ్ళీ వివాదం చెలరేగేలా చేశాడు. పాకిస్తాన్లో ఉన్న ఒక టీవీ ఛానల్ తో వసీమ్ ఖాన్ ఇటీవల  మాట్లాడాడు. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ కు రాకుండా తటస్థ వేదికపై ఆడుతామని చెబుతుంది. ఇక తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్ళేది లేదని తాము ఆడే మ్యాచ్ లను కూడా న్యూట్రల్ వేదికలు కావాలంటూ డిమాండ్ చేశారు వసీంఖాన్. అసలు విషయం చెప్పకుండా భద్రతా లోపం అంటూ కుంటి సాకులు చెబుతుందంటూ ఇమ్రాన్ నజీర్ సైతం ఈ విషయంపై విమర్శలు గుర్తించాడు.



 అయితే ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అటు ఆసియా కప్ నిర్వహణపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపింది అంటూ ఒక వార్త కూడా తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ కు సంబంధించి అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరిగినప్పటికీ భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం మరొక వేదికపై నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అటు వన్డే వరల్డ్ కప్ కోసం తటస్థ వేదిక కావాలంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: