
వెన్నునొప్పి గాయం నుంచి కోలుకొని బుమ్రా మళ్ళీ భారత జట్టులోకి వచ్చినప్పటికీ కొన్ని మ్యాచ్ లలోనే మళ్లీ పాత గాయం తిరగబెట్టింది. దీంతో బుమ్రా ఇక మళ్ళీ జట్టుకు దూరమయ్యాడు. చివరికి సర్జరీ చేయించుకుని వెన్నునొప్పి గాయానికి ఇక శాశ్వత పరిష్కారం ఇవ్వాలి అనుకున్నాడు. ఇక సర్జరీ కారణంగా కొన్ని నెలల నుంచి అతను జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. దాదాపు అతను టీమిండియా కు దూరమై ఎనిమిది నెలలు గడుస్తుంది. అయితే ఇక ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలను టీమిండియా ఆడబోతుంది.
ఆ సమయానికి బుమ్రా అందుబాటులోకి వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అందింది. ఎనిమిది నెలలగా క్రికెట్కు దూరంగా ఉన్న బౌలర్ బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు తెలుస్తోంది తన షూస్ ఫోటోని అతను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. హలో ఫ్రెండ్ మనం మళ్లీ కలుస్తాం అంటూ క్యాప్షన్ పెట్టాడు బుమ్రా. దీంతో బుమ్రా త్వరలో జట్టులోకి రాబోతున్నాడు అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.