తెలుగుదేశంపార్టీ నేతల వ్యవహారశైలి విచిత్రంగా ఉంటుంది. తప్పుచేసి దొరికిపోయినా ఇంకా బుకాయిస్తునే ఉంటారు. పొరబాటున పోలీసులు అరెస్టు చేసి విచారణకు హాజరవ్వాల్సొచ్చినపుడు అనారోగ్యాలు వచ్చేస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రి వైద్యమే చేయించుకోవాలంటూ పట్టుబడతారు. ఎప్పుడైతే కార్పొరేట్ ఆసుపత్రిలో చేరుతారో వెంటనే తమను పట్టి పడీస్తున్న అనారోగ్యాలు ఎక్కడికి పోతాయో కూడా ఎవరికీ తెలీదు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారశైలి ఇపుడు చర్చనీయాంశంగా మారింది కాబట్టే. ఇఎస్ఐ ఆసుపత్రి కోసం కొనుగోలు చేసిన మందులు, వైద్య పరికరాల కుంభకోణంలో అచ్చెన్న తగులుకున్నాడు. కేసును దర్యాప్తు చేసిన ఏసిబి అధికారులు చివరకు అచ్చెన్నను అరెస్టు చేశారు. ఎప్పుడైతే అరెస్టయ్యాడో వెంటనే అనారోగ్యం ముంచుకొచ్చేసింది.
ఏసిబి అధికారులు అచ్చెన్నను ఇంటికి వెళ్ళి మరీ అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. దాంతో చంద్రబాబు దగ్గర నుండి ఎల్లోమీడియా దాకా ఒకటే గోల మొదలుపెట్టేసింది. పైల్స్ ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నపై కనికరం కూడా లేకుండా శ్రీకాకుళం నుండి విజయవాడకు కారులో తెస్తారా ? అంటూ నానా యాగీ చేశారు. ఇదే విషయమై కోర్టులో పిటీషన్ కూడా వేశారు. దాంతో కేసును విచారణ జరిపిన కోర్టు అచ్చెన్నకు వైద్య సౌకర్యాలు అందించమని ఆదేశించింది. దాంతో వైద్య పరీక్షల కోసం అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిరోజులు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న అచ్చెన్నను తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఎప్పుడైతే జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారో వెంటనే అచ్చెన్న అనారోగ్యం తిరగబెట్టింది.
ప్రభుత్వాసుపత్రిలో తనకు సరైన వైద్యం అందటం లేదు కాబట్టి కార్పొరేటు ఆసుపత్రిలో చేరుతానని అచ్చెన్న కోర్టులో కేసు వేశాడు. దాన్ని విచారించిన కోర్టు అచ్చెన్న కోరికను మన్నించింది. వెంటనే అచ్చెన్న డాక్టర్ రమేష్ బాబు ఆసుపత్రిలో చేరిపోయాడు. రమేష్ ఆసుపత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు, కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం వివాదంలో కీలకమైన పోతినేని రమేష్ దే. ఎప్పుడైతే అచ్చెన్న రమేష్ ఆసుత్రిలో చేరాడో అప్పటి నుండి హ్యాపీనే. అచ్చెన్నను కలవటానికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో ఆసుపత్రి చాలా సందడిగా మారిపోయిందట. రమేష్ ఆసుపత్రిలో అచ్చెన్న ఆరోగ్యం కుదుటపడిందని, కాబట్టి మళ్ళీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ విషయం కోర్టు విచారణలో ఉండగానే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. ఇంకేముంది చేసేది లేక పోలీసులు కూడా వెనక్కు తగ్గినట్లున్నారు.
ఈ విషయం ఇలాగుండగానే రమేష్ ఆసుపత్రిలో ఉన్నపుడే బెయిల్ కోసం అచ్చెన్న దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుగుతుండగానే కరోనా అన్నారు. సరే మొత్తానికి కోర్టు కూడా అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేసింది. ఇంకేముంది బెయిల్ వచ్చిన తర్వాత అచ్చెన్నకు మళ్ళీ కరోనా టెస్టులు చేయిస్తే నెగిటివ్ అని రిజల్టు వచ్చిందట. దాంతో ఆసుపత్రి నుండే ఈ మాజీమంత్రి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి వెళ్ళిపోయాడు. ఇపుడీ విషయమే రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. మరి అనారోగ్యం, రమేష్ ఆసుపత్రిలో విశ్రాంతి, కరోనా పాజిటివ్, బెయిల్, కరోనా నెగిటివ్, వెంటనే టెక్కలికి ప్రయాణం భలేగుంది కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి