ఐపీఎల్ 2022 సీజన్ కోసం మెగా వేలం జరుగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మెగా వేలం లో ఏ ఆటగాడు ఏ జట్టు లోకి వెళ్ళి పోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఐపీఎల్ వేలంలో ఎంత మంది స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మెగా వేలం పైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉంటే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అనేదానిపై రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్గా కొనసాగుతూ వచ్చాడు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీయల్ టైటిల్ గెలిపించుకోలేక పోయాడు అన్న విషయం తెలిసిందే.


  ఈ క్రమంలోనే ఇటీవల తాను రాయల్ చాలెంజర్స్  బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు  విరాట్ కోహ్లీ ప్రకటించి షాక్ ఇచ్చాడు. కోహ్లీ తర్వాత అంతటి స్థాయి కలిగి ఉన్న ఆటగాడు ఎబి డివిలియర్స్ కు అతనికి కెప్టెన్సీ ఇస్తారు అని అందరూ అనుకున్నారు.. కానీ అంతలోనే అతను పూర్తిగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.



 ఐపీఎల్ 2022 సీజన్లో విరాట్ కోహ్లీ మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్సిబి యాజమాన్యం విరాట్ కోహ్లీతో చర్చలు జరపగా విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి తప్పనిసరిగా కప్పు గెలిపించాలని తానేంటో నిరూపించుకోవాలని విరాట్ కోహ్లీ కసితో ఉన్నాడట. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు అంటు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వార్తను చూసి అభిమానులు అందరూ హ్యాపీ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: