ఐపీఎల్ సీజన్ 15 కు ఇంకా అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీనితో ఐపీఎల్ లో టైటిల్ కోసం పోటీ పడే ౧౦ జట్లు ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే విషయంలో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా అన్ని టీమ్ లు తాము ఎవరిని అయితే వేలంలో కొనుక్కోవాలి ఒక అంచనాకు వచ్చేశారని చెప్పాలి. కాగా గత ఐపీఎల్ లో యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీ లో అదర గొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఎలాగైనా కప్ ను సాధించాలని పట్టుదలతో ప్రతి ప్రణాళిక రచిస్తోంది. అయితే క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి మొన్ననే అండర్ 19 వరల్డ్ కప్ ను సాధించిన ఇండియన్ కుర్రాళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ నుండి ఓటమై అనేది లేకుండా టైటిల్ ను ఎగరేసుకుపోయిన ఇండియా టీమ్ లో కుర్రాళ్ళు ఫ్రాంచైజీలను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా యష్ దుల్ కేవలం ఒక నాయకుడిలా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా రాణించి జట్టు వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్రా పోషించాడు. ఇతను ఢిల్లీ వాడు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇతనిని వేలంలో దక్కించుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఓపెనర్ గా రాణించిన ఆంగ్ క్రిష్ రఘువంశీ పై కూడా ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరినీ దక్కించుకోవడానికి ఎన్ని కోట్లు అయినా కుమ్మరించడానికి సిద్ధం అని తెలుస్తోంది.

మరి ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహం ప్రకారం ఈ కుర్ర ఆటగాళ్లను దక్కించుకుని పటిష్టంగా మారుతుందా? ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలవని టీమ్ లలో ఢిల్లీ ఒకటి. ఈసారి అయినా తమకు అదృష్టం కలిసి వచ్చి టైటిల్ ను ముద్దాడుతుందా లేదా అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: