ఇంకా ఎన్నిరోజులు కోహ్లీ.. ఇంకా ఎన్ని అవకాశాలు కావాలి.. అసలు నువ్వు మళ్లీ ఫామ్ లోకి రాగలవా లేదా.. నీ ఆటతీరుతో జట్టుకు మైనస్ గా మారిపోతున్నావ్.. నీకు అర్థం అవుతుందా. ఇలా పేలవమైన పామ్ నువ్వు లైట్ తీసుకుంటున్నావేమో.. మాకు అలా లేదు.  ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శన పై అభిమానులు అందరూ కూడా విసుగు చెంది ఇలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రికార్డుల రారాజుగా పేరు సంపాదించుకున్న కోహ్లీ ఇప్పుడు మాత్రం కనీస పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు.


 ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి పేలవా ప్రదర్శనతో నిరాశ పరచడం కోహ్లీకి అలవాటుగా మారిపోయిందని చెప్పాలి. కొన్ని మ్యాచ్ లలో అయితే ఏకంగా డకౌట్ గా వెను తిరుగుతున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇక విరాట్ కోహ్లీ ఆటతీరుపై అభిమానులు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే కోహ్లిని కొన్నాళ్ళపాటు పక్కన పెట్టడం బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై బెంగళూరు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ హస్సన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 అందరిలాగానే కోహ్లీ కూడా  తన ఆట పట్ల విసుగు చెందాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా 20 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. కోహ్లీ పెవిలియన్  చేరేటప్పుడు తీవ్ర అసహనంతో కనిపించాడు.. ఈ క్రమంలోనే కోహ్లీ గురించి హసన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ బాగా ఆడే లాగే  కనిపించాడు. ఇన్నింగ్స్ ను దాటిగా ప్రారంభించడం కోసం తీవ్రంగా శ్రమించాడు. దీంతో మ్యాచ్లో అతను నుండి భారీ ఇన్నింగ్స్ వస్తుందని అనుకున్నామూ. కానీ మరోసారి నిరాశే మిగిలింది. అతను అవుటైన బంతి గ్లౌస్ లకీ తాగుతూ గాల్లోకి వెళ్ళింది. నిజంగా దురదృష్టకరం.  కోహ్లీకీ కూడా ఇది బాధగా అనిపించింది  అతని బ్యాటింగ్ లో టెక్నికల్ గా కూడా ఎలాంటి సమస్యలు కనిపించ లేదు. కానీ కోహ్లీ కూడా అందరిలాగే విసుగు చెందాడు అంటూ బెంగళూరు డైరెక్టర్ హాసన్ వెల్లడించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: