అయితే ఇండియాకు ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న జస్ప్రిత్ బుమ్రా మూడు వికెట్లకు అదర గొట్టాడు అనే విషయం తెలిసిందే. అదే సమయం లో సిరాజ్ కూడా తనదైన బౌలింగ్ తో అదర గొట్టాడు. కీలక మైన మాజీ కెప్టెన్ జో్ రూట్ వికెట్ తీసి టీమిండియాకు విజయం వరించడం మరింత సులభతరం చేశాడు అని చెప్పాలి. టీమిండియా బౌలర్లు విజృంభించడం తో 5 వికెట్లకు 84 పరుగులు మాత్రమే ఇంగ్లండ్ జట్టు పరిమితం అయ్యింది. అయితే సూపర్ ఫామ్లో ఉన్న జో రూట్ సిరాజ్ వేసిన బంతిని ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయం లో 23వ ఓవర్ వేయడానికి వచ్చాడు సిరాజ్. ఓవర్ లో ఆఖరి బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక పోయాడు జో రూట్. మహమ్మద్ సిరాజ్ షార్ట్ పిచ్ బంతి వేయగా జో రూట్ బౌన్సర్ అనుకున్నాడు. జో రూట్ కన్ఫ్యూజన్ లోనే బంతిని టచ్ చేశాడు. చివరికి బంతి బ్యాట్ ఏడ్జ్ తీసుకుంటూ కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో టీమిండియా సంబరాల్లో మునిగి పోయింది.