
ఓపెనర్లు అందించిన భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోలేక వరుసగా ఇండియా వికెట్లను కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్ లో ఎన్నో అంచనాలు మరియు ఒత్తిడితో ఆడుతున్న విరాట్ కోహ్లీ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. రోహిత్ అవుట్ ఐన తర్వాత క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడు బంతులను ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అరంగేట్రం బౌలర్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో మలన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ కు ముందు వరకు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం కనీసం అర్ద సెంచరీ అయినా చేస్తాడని అభిమానులు మరియు జట్టు యజమాన్యమ్ ఎంతో నమ్మకం పెట్టుకుంది.
కానీ కోహ్లీ మాత్రం తన తీరును మార్చుకోకుండానే ఎప్పటిలాగే అవుట్ అయ్యాయి కోట్లాదిమంది ఆశలను నీరుగార్చాడు. దీనితో ఇక అందరూ ఫిక్స్ అయిపోయారు... కోహ్లీ ఇక ఫామ్ లోకి రావడం కుదరదు. సీనియర్ ఆటగాళ్లు చెబుతున్న విధంగా కోహ్లీని ఇంటికి సాగనంపాలి అని అంటున్నారు.