రోహిత్ శర్మ ఇండియా వైట్ బాల్ కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ లో ఆడలేకపోయిన రోహిత్ శర్మ... తర్వాత కోలుకుని టీ 20 సిరీస్ మరియు వన్ డే సిరీస్ లకు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటికే టీ 20 టైటిల్ ను గెలుచుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు వన్ డే టైటిల్ పై కన్నేసింది. అందులో భాగంగా రెండు రోజుల ముందు జరిగిన మొదటి వన్ డే లో ఇంగ్లాండ్ ను కేవలం 110 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఇందులో బుమ్రా 6 వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆ మ్యాచ్ లో 111 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ మరియు ధావన్ లు వికెట్ కోల్పోకుండా కేవలం 18.4 ఓవర్లలో ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.

అయితే ఇప్పుడు రెండవ వన్ డే కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇంగ్లాండ్ తడబడుతూ ఆడుతోంది. ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.  ఈ పరిస్థితిలో ఎంత వరకు ఇండియా ముందు ఫైటింగ్ టోటల్ ఉంచుతారు అన్నది తెలియదు. ఇప్పుడు క్రీజులో ఉన్న లివింగ్ స్టన్ మరియు మొయిన్ అలీ లు కనుక వికెట్ పడకుండా పూర్తి ఓవర్ లు ఆడితే గౌరవప్రదమైన స్కోర్ ను ఇండియా ముందు ఉంచగలదు. లేదా 200 కు కూడా ఆల్ అవుట్ అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

కానీ టార్గెట్ ఎంత అయినా గత మ్యాచ్ లాగా ఓపెనర్లు రోహిత్ ధావన్ లే ఊదేస్తారా లేదా మిగిలిన ప్లేయర్లకు కనీసం ఆడే అవకాశం ఇస్తారా అన్నది ఇక్కడ చాలా మంది ఇండియన్స్ సందేహం. ఎందుకంటే రోహిత్ గత మ్యాచ్ లో ఆడిన తీరు చూస్తే ఫుల్ ఫామ్ కి వచ్చినట్టున్నాడు. ఇక గబ్బర్ ఎప్పటిలాగే డీసెంట్ క్లాస్ బ్యాటింగ్ నిలకడగా ఆడుతున్నాడు. మరి చూద్దాం... మరో ఘన విజయం దక్కుతుందా లేదా ఇంగ్లాండ్ పోటీ ఇస్తుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: