క్రికెటర్ లకు సంబంధించిన ఏదైనా చిన్న విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో సంచలనంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించిన ఒక వార్త హాట్  టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చాహల్ ను ఉద్దేశిస్తూ జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతోమంది నెటిజన్లు.  ఇందుకు కారణం చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కావడం.


 గతంలో చాహల్ భార్య శ్రేయస్ అయ్యర్ తో కలిసి డాన్స్ చేసిన వీడియో చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకచోట కనిపించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ ఆరోపించడం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఒక పార్టీకి చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ వచ్చింది. ఆమెతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ అతని సతీమణి దివిష సహా ధను శ్రీ వర్మ, శ్రేయస్ అయ్యర్ కలిసి ఒక ఫోటో దిగారు.


 ఫోటో లో భాగంగా ఒక వైపు శ్రేయస్, ధనశ్రీ వర్మ నిలబడితే మరోవైపు సూర్యకుమార్ యాదవ్ అతని సతీమణి నిలబడింది. ఇందుకు సంబంధించిన ఫోటోని పోస్ట్ చేస్తూ గత రాత్రి ఇలా గడిపాము.. చాహల్ నిన్ను మిస్ అవ్వలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది  దివిషా.  దీంతో శ్రేయస్ అయ్యర్ కు చాహల్ భార్య తో ఎఫైర్ ఉందని చాహల్ తొందరగా అప్రమత్తం కాకపోతే గతంలో దినేష్ కార్తీక్ కు పట్టిన పరిస్థితి నీకు తప్పదు అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో చాహల్ కు మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. అనవసరంగా చాహల్ భార్యను నిందించడం సరికాదు అంటున్నారు కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: