ఏకంగా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ తర్వాత ఇక టీమిండియా ఆడిన అన్ని టి20 మ్యాచ్ లకు కూడా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. అతనే రెగ్యులర్ కెప్టెన్ అని ప్రకటించకపోయిన బిసిసిఐ వరుసగా అతనికి సారధ్యమందిస్తున్న తీరు చూసి అందరూ ఇది ఫిక్స్ అయిపోయారు. రోహిత్ తర్వాత మూడు ఫార్మాట్ల సారధ్య బాధితులను భుజాన వేసుకోబోయేది హార్దిక్ పాండ్యానే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం టి20 ఫార్మాట్కు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ ఊహించని షాక్ ఇవ్వబోతుంది అన్నది తెలుస్తుంది.
ఈనెల 30వ తేదీ నుంచి భారత్ ఆసియా కప్ ఆడబోతుంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికలలో ఇక ఈ టోర్నీ జరగబోతుంది అయితే ఇక ఆసియా కప్ 2023లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా రోహిత్ కు డిప్యూటీగా పేసర్ బుమ్రాను నియమిస్తారని తెలుస్తుంది ప్రస్తుతం వన్డేల్లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా పై వేటు వేయబోతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారికంగా బీసీసీఐ ధ్రువీకరించబోతుందట. అయితే కెప్టెన్సీ పరంగా చూస్తే హార్దిక్ కంటే బుమ్రా ముందు వరుసలో ఉన్నాడని.. 2022లో టెస్ట్ టీంకు సారధిగా కూడా వ్యవహరించాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి