ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్లో భాగంగా టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. భారత జట్టు దూకుడు చూస్తూ ఉంటే ఈసారి తప్పకుండా టైటిల్ గెలిచేలాగే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్కప్ లో భాగంగా వరుస మ్యాచ్లతో బిజీ బిజీగా ఈ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే  మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఆడబోతుంది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో తలబడబోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతుండగా.. చివరి మ్యాచ్ డిసెంబర్ మూడవ తేదీన హైదరాబాద్ వేదికగా జరగబోతుంది. దీంతో ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధం అయిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అందింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ వేదికను హైదరాబాద్ నుంచి మార్చే అవకాశం ఉందట. ఎందుకంటే డిసెంబర్ మూడవ తేదీన ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీంతో మ్యాచ్ కు పూర్తిస్థాయి భద్రత కల్పించలేమని పోలీసులు స్పష్టం చేశారట.


 ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిందట. అయితే బిసిసిఐ దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది  అయితే ఒకవేళ హైదరాబాద్లో మ్యాచ్ నిర్వహణకు అవకాశం లేకపోతే మ్యాచ్ వేదికను హైదరాబాద్ నుంచి మరో చోటికి మార్చే అవకాశం ఉంది. ఇది నిజంగా హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత.. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన.. ఇక ఇప్పుడు అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: