మా జట్టు గెలుస్తుంది అంటే మా జట్టు గెలుస్తుంది అంటూ అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రాంతాలుగా విడిపోయి మరి తమ టీమ్స్ కి ఇక మద్దతు పలుకుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలోనే అటు ఎంతో మంది క్రికెట్ మాజీలు కూడా రివ్యూలు ఇవ్వడంలో బిజీ బిజీగా ఉంటారు. ఇక నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక క్రికెట్ కు సంబంధించిన విషయాలు ఎక్కడ చూసిన కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అయితే కేవలం ఐపిఎల్ కు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు భారత క్రికెట్కు సంబంధించిన ఎన్నో విషయాల గురించి కూడా అటు క్రికెట్ మాజీలు చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా భారత క్రికెట్ లో లెజెండ్స్ గా కొనసాగుతున్న నలుగురు ఆటగాళ్లలో ఎవరు అత్యుత్తమం అనే ప్రశ్న ఎదురు కాగా ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్,మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్మెన్ అనే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే నవజ్యోత్ సిద్దు విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లలోను కోహ్లీ అదరగొట్టాడని.. టెక్నికల్గా అతను అత్యుత్తమ ప్లేయర్ అంటూ ప్రశంసల కురిపించాడు. తన జట్టును గెలిపించడం కోసం కోహ్లీ ఎప్పుడు అత్యుత్తమంగా ఆడతాడు అంటూ నవజ్యోత్ సిద్దు అభిప్రాయం వ్యక్తం చేశాడు.