ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీమ్స్ గా కొనసాగుతూ ఉన్నాయి ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. అయితే ఈ రెండు టీమ్స్ తో సమానంగానే అటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టీం ఏదైనా ఉంది అంటే అది కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏకంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఊహించని రీతిలో ఈ జట్టుకు మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఆర్సిబి జట్టులోనే కనిపిస్తూ ఉంటారు.


 అయినప్పటికీ అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రం ఒక్కసారి కూడా అటు అదృష్టం మాత్రం కలిసి రాలేదు అని చెప్పాలి. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరిని కూడా నిరాశ పరుస్తూనే ఉంటుంది  అయితే ఇక ఇప్పుడు మాత్రం ఈ ఐపిఎల్ సీజన్ లో తప్పకుండా టైటిల్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగింది  అయితే ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి టైటిల్ గెలిచింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని అటు ఐపీఎల్ లో కూడా రిపీట్ చేయాలని భావిస్తూ ఉంది  ఆర్సిబి.


 అయితే కనీసం ఐపీఎల్ 17వ సీజన్లో అయినా అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలుస్తుందా లేదా అనే విషయంపై ఆ జట్టు మాజీ ఆటగాడు మిస్టర్ 360 ప్లేయర్ ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ కి కామెంటేటర్ అవతారం ఎత్తాడు ఈ మాజీ ప్లేయర్  అయితే తమ జట్టు ఈసారి ట్రోఫీ గెలుస్తుందని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై ఒక సెంటిమెంట్ ని కూడా చెప్పుకొచ్చాడు  నా జెర్సీ నెంబర్ 17 ప్రస్తుతం జరుగుతుంది 17వ ఐపీఎల్ సీజన్. దీంతో ఆర్సిబి కప్పు గెలుస్తుందని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఏబీడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl