టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం మొత్తం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. అయితే అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిలా కాకుండా.. ఏకంగా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిగా ధోని తన ప్రస్థానం కొనసాగించాడు. ఇక భారత జట్టు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండు సార్లు అందించాడు ధోని.


 ఇప్పటికీ కూడా ఈ రికార్డు ఏ కెప్టెన్ కు సాధ్యం కాలేదు అనడంలో సందేహం లేదు. అయితే  కేవలం కెప్టెన్ గా మాత్రమే కాకుండా బెస్ట్ ఫినిషర్ గా, బెస్ట్ వికెట్ కీపర్ గా తన ప్రస్తానాన్ని కొనసాగించాడు ధోని. అయితే ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్న ఇంకా అతనికి ఉన్న క్రేజ్ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ తగ్గడం లేదు. ఇక ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన వార్త ఏదో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే ధోని లాంటి క్రికెటర్ దగ్గర నుంచి సూచనలు తీసుకోవాలని యువ ఆటగాళ్లు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు.


 అలాంటిది ఏకంగా మహేంద్ర సింగ్ ధోని నుంచి ఒక బహుమతి అందితే ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక ఇటీవల ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇదే జరిగింది మ్యాచ్ గెలిచిన తర్వాత ఓడిన కోల్కత్తా ప్లేయర్లతో ముచ్చటించారు ధోని. ఈ క్రమంలోనే ఆయన సంతకం చేసిన బ్యాట్ ను తనకు బహుమతిగా ఇచ్చినట్లు కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రహ్మణుల్లా గుర్బాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతం గురించి చింతించడం మానేయండి.. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి.. ఈ క్షణంలో జీవించి సంతోషంగా ఉండండి అంటూ ధోని తనతో చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు కేకేఆర్ ప్లేయర్ రహ్మనుల్లా గుర్బాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl