2025 ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సిబి అభిమానులు నిన్నటి రోజున రాత్రి నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద భారీగా తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఏకంగా 11 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 50 మందికి పైగా గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్న స్వామి స్టేడియం వద్ద విషాదఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి ఆర్సిబి టైటిల్ ని కైవాసం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.


ఈ సందర్భంగా బెంగళూరులో చిన్న స్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు.. కానీ అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియం వద్దకు రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగిందట. ఈ ఘటనలో భాగంగా అక్కడ 11 మంది మరణించగా 50 మందికిపైగా గాయాలయ్యాయట. అయితే మరణించిన వారిలో కూడా చిన్న పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు కూడా అక్కడ పరిస్థితులను అదుపు చేయలేకపోయినట్లు సమాచారం.


ఇదంతా ఇలా ఉంటే ఈ సెలబ్రేషన్స్ కు అనుమతి మొదట ఇవ్వకపోయినా అయితే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అతి తక్కువ సమయంలో ఈ ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. స్టేడియం లోపలకి ఒక్క సారిగా అభిమానులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే చిన్నస్వామి స్టేడియం నుంచి అభిమానులను ఖాళీ చేయించేలా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు ఈ వ్యవహారం పైన ప్రజలతోపాటు నెటిజెన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్టు కూడా ఈ విధంగా ఓవరాక్షన్ చేయలేదు అంటూ చాలామంది నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వీరి అతి కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: