
శివమ్ దూబే మూడు వికెట్లు సాధించి తన పాత్ర పోషించాడు. పెద్ద భాగస్వామ్యాలు లేకపోవడంతో యూఏఈ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ చిన్న టార్గెట్ ఛేదించడానికి భారత్ బరిలోకి దిగింది. ప్రారంభంలోనే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వేగంగా ఆడుతూ మ్యాచ్ను సులభం చేశాడు. అతను కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేయడం గమనార్హం. పవర్ప్లేలోనే బౌండరీలు, సిక్స్లు కొట్టి వేగంగా స్కోరు పరుగులు పెట్టించారు. అయితే 30 పరుగుల వద్ద ఔటైన తర్వాత, ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్ మరియు సూర్యకుమార్ యాదవ్ ముగించారు. గిల్ నాటౌట్గా నిలవగా, సూర్యకుమార్ యాదవ్ వచ్చి మొదటి బంతికే సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
ఓవరాల్గా భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఏకంగా 10 + రన్రేటు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తన స్పిన్ మ్యాజిక్తో యూఏఈ బ్యాటింగ్ను కూలదోయిన కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయం ద్వారా భారత్ ఆసియా కప్ 2025లో తాను ప్రబలమైన జట్టు అని మరోసారి నిరూపించింది. మొత్తానికి, యూఏఈపై భారత్ సాధించిన ఈ సులభ విజయంతో భారత్ ఆసియా కప్లో తన జైతయాత్ర ఘనంగా ప్రారంభించింది. వచ్చే ఆదివారం భారత్.. పాకిస్తాన్తో తన రెండో మ్యాచ్ను ఆడుతుంది. పాక్కు యూఏఈపై ఘన విజయంతో పరోక్ష హెచ్చరికలు పంపినట్లైంది.