సమంతమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోలందరితో ఆడిపాడింది ఆ తర్వాత నాగచైతన్య నీ పెళ్లి చేసుకొని అక్కినేని వారి ఇంటి కోడలు అయింది. పెళ్లి తర్వాత కూడా రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించి అందరి మెప్పు పొందింది. ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే ఆహా ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా సమంత గురించి చెప్పాలంటే ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూ సమంత ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత  సక్సెస్ రేటు కూడా పెరిగింది, గతేడాది మామ నాగార్జున ‘వైల్డ్ డాగ్’  సినిమా షూటింగ్ కోసం వెళితే.. హౌస్ బాధ్యతలను తనపై వేసుకొని ఈ షోను తనదైన శైలిలో నడిపించి వావ్ అనిపించింది. ఇపుడు ‘ఆహా’ ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి సామ్ జామ్ ప్రోగ్రామ్‌కు వన్నె తెచ్చింది. ఎంతో ఆర్భాటంగా ఆహా ఓటీటీలో ప్రసారమైన ‘సామ్ జామ్’ తొలి ట్రైలర్ విడుదల కాగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఐతే.. ఈ షో ప్రారంభమైన తర్వాత ప్రేక్షకులను నుంచి సరైన స్పందన రావడం లేదు. దానికి ఓ రీజన్ ఉంది. ఈ  ప్రోగ్రామ్ టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కాకపోవడం ఒక కారణం. మరోవైపు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు.
కేవలం ‘ఆహా’ ఓటీటీ వేదికలో ప్రసారమవుతుండటంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదనే విషయం స్పష్టమవుతుంది. పైగా ‘ఆహా’ ఓటీటీలో సమంత  ఇంటర్వ్యూలు చేసే సెలబ్రిటీలు మెగా, అక్కినేని ఫ్యామిలీస్‌కు సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉండటం దీనిపై నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. కేవలం సినీ రంగంలో కొంత మంది ఫ్యామిలీ వాళ్లే ఇందులో కనబడుతున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. ఆ రెండు ఫ్యామిలీ మెంబర్స్ నే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలతో పాటు సెలబ్రిటీస్ ని కూడా ఇంటర్వ్యూ చేస్తే సామ్ జామ్ షో సక్సెస్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: