బుల్లితెరపై ఒకానొక సమయంలో మంచి యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణుప్రియ, కరోనా సమయం తర్వాత అసలు ఎటువంటి ప్రోగ్రామ్ లు కూడా చేయలేదు. ఇక ఈమె సోషల్ మీడియాకు చాలా దగ్గరగా ఉంటూ, అప్పుడప్పుడు కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అయితే విష్ణు ప్రియ మీద హైపర్ ఆది కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ విషయాలను తెలుసుకుందాం.

విష్ణు ప్రియ, సుడిగాలి సుధీర్ తో కలిసి ఎన్నో ప్రోగ్రాము లు, చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతే కాకుండా ఈమె వివిధ భాషలలో కొన్ని సినిమాలలో నటించి,  మంచి నటిగా అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెరపై తన అందంతో, తన పంచ్ డైలాగులతో, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది విష్ణుప్రియ.


ఇక ఆ మధ్య కొంతకాలంలో విష్ణు ప్రియ, సుధీర్ బాగా దగ్గరగా ఉండడంతో.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ అప్పట్లో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత తిరిగి మరీ బుల్లితెరపై సందడి చేయడానికి రెడీ అయింది విష్ణుప్రియ. తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఈమె రీఎంట్రీ ఇచ్చింది అని చెప్పవచ్చు.

ఈ షోలో కమెడియన్ హైపర్ ఆది టీంలోకి గెస్ట్ గా వచ్చింది విష్ణుప్రియ. ఈమె ఎంట్రీ తోనే అందరినీ ఎంతగానో నవ్వించింది. ఇక ఎప్పటిలాగే తన పంచులతో ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇక వీరు చేసిన హంగామా మొత్తం ఈ ప్రోమో లో కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా విష్ణు ప్రియ ముక్కు మీద వేసే పంచ్ డైలాగులు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక హైపర్ ఆది కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వించ సాగాడు. అందులో ముఖ్యంగా సుధీర్ మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక ఒక సందర్భంలో కెమెరాలడ్డోస్తున్నాయి విష్ణు ప్రియ.. అంటూ కూడా కామెంట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: