ఇక ఆ తరవాత ఇటీవల ఓ టి టి లో ప్రసారమైన బిగ్ బాస్ లోనూ అవకాశం అందుకుని మళ్ళీ తన బజ్ క్రియేట్ చేసింది. ఇక హౌజ్ లో తోటి కంటెస్టెంట్ అజయ్ తో ఈ అమ్మడు చాలా క్లోజ్ గా మూవ్ అయిన విషయం తెలిసిందే. షో కాస్త ముగియడంతో మళ్ళీ సోషల్ మీడియాలో దూకుడు పెంచింది అషూ. తాజాగా ఈమె చేసిన పోస్ట్ ఒకటి ట్రోల్స్ మద్య చిక్కుకుంది. అజయ్ ఇంకా అధు రెడ్డి కలిసి వారి కుక్కపిల్లతో సరదాగా కూర్చుని ఉన్న ఫోటోని అషు సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా...ఏంటి బిగ్ బాస్ అయిపోయినా ఇంకా మీరు క్లోజ్ గానే ఉన్నారా...అంటే ఏదో తేడా కొడుతోందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కానీ ఈ విషయంపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు. అయితే ఇక్కడ ఇవన్నీ మాములే అయినప్పటికీ... సోషల్ మీడియా ఎవరినీ అంత తేలిగ్గా వదలదు. మరి ఈ విషయం గురించి అషూ ఏమైనా స్పందిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్ది రోజుల క్రితం సింగర్ రాహుల్ సింప్లి గంజ్ తోనూ సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వీరి గురించి వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో చూశాము. చివైరికి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ శుభం కార్డు వేశారు. మరి ఇక్కడ ఏమి జరుగుతుందో?