బుల్లితెరపై శ్రీముఖి చేసే సందడి అంతా అంతా కాదు ఎప్పుడూ కూడా చాలా అల్లరిగా ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి చానల్స్ లో కూడా తన సందడి కొనసాగిస్తూ ఉంటుంది శ్రీముఖి. ఇక ఇప్పుడు తాజాగా ఓటీటి లోకి కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆహాలో ఓంకార్ ఒక డాన్స్ షోని చేయబోతున్నారు.. ఈ డ్యాన్స్ షో వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే అషో కు సంబంధించిన పలు విషయాలను ప్రకటించడం జరిగింది ఈ షో కి జడ్జిలుగా శేఖర్ మాస్టర్ ఉండబోతున్నారు ఆయనతో పాటు మరొక లేడీ జడ్జి కూడా ఉండబోతోంది.. ఆమె మోనాల్ గర్జన్. యశ్ మాస్టర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక అలా వీరందరితోపాటు యాంకర్ శ్రీముఖి కూడా ఉండబోతున్నట్లు సమాచారం.డ్యాన్స్ ప్లస్ టీమ్ ని ఓంకార్ కూడా ఇక్కడ కంటిన్యూ చేసే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రోమోలో మాత్రం శ్రీముఖి తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.. రారా రాకమ్మ అంటూ శ్రీముఖి స్టేజ్ మీద తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఈ వీడియో కంటే ముందు కేరవ్యాన్ లో శ్రీముఖి మాస్ స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లుగా ఒక వీడియోని విడుదల చేసింది. శ్రీముఖి ఎప్పుడూ కూడా తన రిల్ వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది.


ఇక ఆ మధ్య శేఖర్ మాస్టర్ తో కలిసి శ్రీముఖి చిందులు వేయడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. శ్రీముఖి స్టేజి మీద అయినా ఎక్కడైనా సరే తన డ్యాన్స్ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. శ్రీముఖి బుల్లితెర పైన ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయింది. ఇక ఈటీవీలో జాతి రత్నాలు, జీ తెలుగులో పలు షోలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: