బుల్లితెర ఆర్టిస్టుగా.. సీరియల్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఈమె జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేసే ఈ ముద్దుగుమ్మ మొదట్లో డబ్ స్మాష్ వీడియోలు , టిక్ టాక్ వీడియోలు చేస్తూ మరింతగా సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంది.

అలాగే యూట్యూబ్లో కూడా కొత్త ఛానల్ ను ఏర్పాటు చేసి కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేస్తూ అందులో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ అంటే ప్రతి ఒక్కరికి బాగా పరిచయమే.  కేవలం బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితం.. ఎక్కువగా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇంటిగట్టు,  అమ్మ కోసం వంటి సీరియల్స్ లో కూడా చేసిన ఈమె సీరియల్ నటిగా కూడా పేరు సంపాదించుకుంది. జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో రచ్చ చేస్తూనే ఒకవైపు సీరియల్స్ మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు సోషల్ మీడియా అంటూ చాలా క్రేజీ తెచ్చుకుంది.  అంతేకాదు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతకు చెమటలు పట్టించింది.ఇదిలా ఉండగా తాజాగా తన తండ్రి మరణించిన విషయం తెలిసిందే.  దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎమోషనల్ అయింది.. ఇదిలో ఉండగా తాజాగా తన తండ్రి మరణించిన చివరి మాటలను గుర్తు చేసుకొని మరొకసారి ఎమోషనల్ అయింది రీతూ.. మానసిక ప్రశాంతత కోసం ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టిన ఈమెకు ఒక అభిమాని మీ డాడీతో లాస్ట్ కాన్వర్జేషన్ ఏంటి అక్క? అని అడగ్గా .."మార్నింగ్ యూట్యూబ్ వ్లాగ్ చేద్దాం ఎర్లీగా పడుకో అమ్ములు అని అన్నారు.. ఇదే లాస్ట్ కన్వర్జేషన్.. మార్నింగ్ నేను లేవగానే మా డాడ్ లేడు అనే న్యూస్ విన్నాను" అంటూ ఎమోషనల్ అయింది రీతూ.

మరింత సమాచారం తెలుసుకోండి: