సాధారణంగా బుల్లితెర పై సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది . ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో వస్తున్న టిక్ టాక్ , యూట్యూబ్ వంటి మార్గాల ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుని.. ఆ తర్వాత బుల్లితెర పై మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఒకసారి బుల్లితెరపై గుర్తింపు లభించింది అంటే వెండితెరపై అవకాశాలు రావడం ఏమీ కాదు కానీ వెండితెరపై అవకాశాలు వచ్చినాసరే వాటిని నిలబెట్టుకుని ముందుకు వెళ్లి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు.

ఇకపోతే చాలామంది బుల్లితెర షోలు చేసి ఇప్పుడు సక్సెస్ బాట పట్టారు. అలాంటి వారిలో కలర్స్ స్వాతిని మొదలుకొని సుడిగాలి సుదీర్ వరకు చాలామంది బుల్లితెరపై సందడి చేసి ఆ తర్వాత సినిమాలలో సక్సెస్ అయిన వారే.ముఖ్యంగా బుల్లితెర షోలలో కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా స్వాతి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ఆ తర్వాత సినిమాలలో కూడా హీరోయిన్గా నటించే సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు అవకాశాలు లేక అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. ఇక ఈమె తర్వాత మౌని రాయ్ కూడా హిందీ సీరియల్స్ తో పాటు తెలుగు సీరియల్స్ లో కూడా నటించి మరింత ఇమేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం బ్రహ్మస్త్ర సినిమాలో విలన్ పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించింది మౌని రాయ్.

వీరితోపాటు అనసూయ కూడా బుల్లితెర షో  లు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు మరొక పాత్ర నచ్చితే అవకాశాలు దక్కించుకొని మరింత పాపులారిటీ దక్కించుకుంది.  ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే పాన్ ఇండియా సెలబ్రిటీ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక వీరితోపాటు సుధీర్ కూడా సినిమాలలో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: