ఇకపోతే ఈ మధ్య బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్లాట్ లో ఆత్మహత్మ చేసుకున్న విషయం తెల్సిందే. ఇతను మరణించడానికంటే ముందే అంటే వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. దీంతో వీరి ఆత్మహత్యలపై దేశ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరివి ఆత్మహత్యలు కావని.. ఎవరో హత్య చేసి ఇలా చిత్రీకరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ కేసులో ముంబై పోలీసుల తీరు అనుమానాలను పెంచుతుండగా, చివరికి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే చివరి సారిగా దిశకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ప్రియుడు రోహాన్ ఇంట్లో జరిగిన పార్టీలో హృతిక్ రోషన్ నటించిన మిషన్ కశ్మీర్లోని రిండ్ పొష్మల్ పాటకి దిశ సంతోషంగా స్టెప్పులేయడం కనిపిస్తుంది.
ఈ వీడియోను బట్టి చూస్తే సంతోషంగా ఉన్న దిశ ఆత్మహత్య చేసుకోవడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతూ, దిశ ఆత్మహత్య కేసును కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారట. ఇక తెరవెనక ఏం జరిగిందనేది ఎవరికి సరిగ్గా తెలియదు కానీ, మంచి భవిష్యత్తు ఉన్న రెండు నిండు ప్రాణాలు మాత్రం అర్ధాంతరంగా తనువు చాలించాయి..