ఆకారం, బలంతో సంబంధం లేకుండా ఎంతో ప్రశాంతంగా కనిపించే జంతువులలో అటు ఏనుగు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అడవిలో ఉండే అన్ని జంతువుల కంటే ఎక్కువ బలం కలిగింది ఏనుగు మాత్రమే. అంతేకాదు ఇక మనుషుల తరహాలోనే ఎక్కువ భావోద్వేగాలను కలిగి ఉంటుంది ఏనుగు. మనుషులతో దగ్గర సంబంధాలు కలిగి ఉన్న జంతువుగా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  అయితే ఇలా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఏనుగుకు కోపం వస్తే ఏకంగా మృగరాజు సైతం భయంతో పరుగులు తీయాల్సిందే.


 లేదంటే మృగరాజు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోవడం ఖాయం అని చెప్పాలి. ఇక అలాంటి ఏనుగు కొన్ని కొన్ని సార్లు ఇక పర్యటకులపై దాడి చేయడానికి దూసుకు వచ్చిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం మరింత అరుదైనది అని చెప్పాలి. ఎందుకంటే అడవిలో రెండు భారీ ఏనుగుల మధ్య బికరమైన పోరు జరిగింది. ఇక ఈ పోరులో అక్కడే ఉన్న చెట్లు సైతం అగ్గిపుల్లల విరిగిపోయాయి అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ బీకరమైన పోరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి వెన్నులో భయం కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న కృగర్ నేషనల్ పార్క్ లో జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే పర్యటకులు ఎప్పటిలాగానే ఇక అడవిలో ఉండే జంతువులను ఫోటోలు వీడియోలు తీసేందుకు వెళ్లారు. ఆ సమయంలోనే రెండు భారీ ఏనుగులు ఎదురుపడ్డాయి. ముందుగా మనుషుల్లాగానే రెండు ఏనుగులు కూడా ఒకదాని కళ్ళల్లోకి మరొకటి కోపంగా చూసుకున్నాయి. ఆ తర్వాత ఏకంగా దెబ్బలాడుకున్నాయి. ఏనుగుల భీకరమైన పోరులో ఏకంగా చెట్టు అగ్గిపుల్లల విరిగిపోయింది  అని చెప్పాలి. ఇది చూసి భయపడిన పర్యటకులు ఇక తమ వాహనాన్ని కాస్త వెనక్కి పోనివ్వడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: