సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, సరైన పోషక ఆహారం తీసుకోవడంతో పాటు మనస్సు నిశ్చలంగా ఉండాలి. అప్పుడే ఎక్కువ కాలం జీవించడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ మనం పౌష్టికాహారం తీసుకుంటున్నప్పటికీ, మనం ఎక్కువగా నిరీక్షణకు లోనవడం లేదా ఏదో మనసు కలత చెంది ఉండటం, ఎక్కువ గా ఆలోచించడం  వంటి ప్రభావాలు కూడా ఆరోగ్యాన్ని క్షీణించడానికి కారకాలు అవుతాయి. అయితే ముఖ్యంగా మన దేశంలోని ప్రజలు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు అని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. పారిశ్రామిక దేశాలలో నివసిస్తున్న ప్రజలకు మన భారతదేశంలో నివసిస్తున్న ప్రజలకు మధ్య ఉన్న తేడాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


పారిశ్రామిక దేశాలలో ప్రజలు ఆధునిక వైద్య సంరక్షణ ను కలిగి ఉన్నప్పటికీ, వారు ఎక్కువగా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా వారు తీసుకునే ఆహారంలో సంతృప్త కొవ్వు ఉన్న ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇక అలాగే ఆరోగ్య సంరక్షణ కోసం, శారీరకంగా వృద్ధి చెందాలి అంటే చేపలు ,కూరగాయలు ,అధిక ఫైబర్ కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంటారు అమెజాన్ దేశ ప్రజలు.

అయితే అమెజాన్ దేశీయ ప్రజల పై జరిగిన అధ్యయనం ప్రకారం వీళ్ళ వయసు, వయసు పెరిగే కొద్దీ మెదడు తక్కువగా క్షీణించడం జరుగుతోందట. అంటే వీరి మెదడు చురుకుగా పని చేయడంతో పాటు వీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి కూడా కారణం వీరు తీసుకునే ఆహారం అని చెప్పవచ్చు.


సాధారణంగా సైన్స్ అధ్యయనం ప్రకారం మనకు తెలిసిన విషయం ఏమిటంటే, వయసు పెరిగే కొద్దీ మన మెదడు శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధులు, వయసు పెరిగే కొద్దీ ఆలోచించే గుణం తగ్గిపోవడం, మన మెదడు సరిగ్గా ఆలోచించకపోవడం వంటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయి..

ముఖ్యంగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం , బొలీవియన్ అమెజాన్ యొక్క టిసిమెన్ దేశీయ ప్రజలను,  అమెరికన్ అలాగే యూరోపియన్ దేశాల ప్రజలతో పోల్చినప్పుడు , వీరి కంటే టిసిమెన్ ప్రజలు తక్కువ మెదడు క్షీణతను అనుభవిస్తున్నారని కనుగొన్నారు. అంతేకాకుండా వీరి ఆరోగ్యకరమైన మెదడు చాలా ప్రత్యేకమైనది. ఇక నెమ్మదిగా వయసు, వయసు తో పాటు వారి మెదడు శక్తి తగ్గడం మిగతా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే 70 శాతం నెమ్మదిగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వేగవంతమైన మెదడు శక్తి తగ్గిపోవడం చిత్తవైకల్యం కి సంకేతమని scitechdaily.com లో నివేదించబడింది.


అయితే ఈ అధ్యయనం ఎలా జరిగింది అంటే ,పరిశోధకులు తమ అధ్యయనంలో 40 నుండి  94 సంవత్సరాల వయసుగల 746 మంది టిసిమన్ పెద్దలను చేర్చుకున్నారు. పరిశోధకులు వాలంటీర్లను బ్రెయిన్ స్కాన్ అలాగే సిటి స్కాన్ చేశారు. మెదడు యొక్క వాల్యూమ్ ను లెక్కించడానికి మెదడుకు స్కానింగ్ చేశారు పరిశోధకులు.. అంతేకాకుండా వారి మెదడు అలాగే వారి వయస్సు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా అధ్యయనం చేశారు. ఇక ఆ తరువాత యూఎస్ అలాగే ఐరోపా లోని ముగ్గురు పారిశ్రామిక వ్యక్తులతో పోల్చారు..


ఈ అధ్యయనం ద్వారా తేలిన విషయం ఏమిటంటే ,వీరి జనాభా కంటే మధ్యవయసు అలాగే వృద్ధాప్యం మధ్య మెదడు వాల్యూమ్ లో వ్యత్యాసం  70 శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.. అంటే చివరిగా కనుగొన్నది ఏమంటే వీరు నిశ్చలమైన జీవన శైలితో కూడిన జీవితాన్ని గడపడమే, వీరు ఆరోగ్యంగా ఉండటానికి కారణం అని  టిసిమన్ దేశ ప్రజలు చెబుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: