ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ఇక ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లేకుండా కనీసం ఒక్క నిమిషం కూడా ఉండలేక పోతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి ఆన్లైన్లోనే కాలం గడుపుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నేటి రోజుల్లో ఇలా ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో ఎప్పుడూ ఎన్నో రకాల ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ఆసక్తికర వీడియోలకు ఆకర్షితులవుతున్న ఎంతో మంది ప్రముఖులు ఆ వీడియోలను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇక ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు ఇలాగే ఒక వీడియో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆవుపేడతో మహిళలు పిడకలు  చేయడం గురించి అందరికీ తెలిసే ఉంటుంది  నేటి జనరేషన్ పిల్లలు అయితే అది చూసి ఉండరు. కానీ నిన్నటి తరం పిల్లలు మాత్రం తప్పకుండా అది చూసే ఉంటారు. ఇక ఇలా ఆవు పేడతో పిడకలు కొట్టడం.. ఆ పిడకలను   కట్టెలుగా ఉపయోగించి వంట చేసుకోవడం లాంటివి చేసేవారు ఒకప్పుడు. నేటి రోజుల్లో గ్యాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎవరూ కూడా ఇలాంటి పిడకల  జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ ఓ మహిళ గోడపై పిడకలు కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. పిలకలు కొట్టడంలో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారు కదా.


 ఇంతకీ స్పెషాలిటీ ఏమిటంటే.. ఇక్కడ ఉన్న మహిళా పిడకలు కొట్టడం లో పీహెచ్డీ చేసినట్లు కనిపిస్తుంది. ఈమె ముందు ఉన్న గోడ భారీ ఎత్తున ఉంది. కానీ అలవోకగా వరుసక్రమంలో పిడకలు కొడుతున్న ఉండడం  గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఆమె టాలెంట్ను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఆమె అంత ఖచ్చితంగా ఎలా వరుసక్రమంలో పిడకలు కొట్ట కలుగుతుంది  అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. దీనిని చత్తీస్గడ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అవనిష్ శరణ్ తన ట్విట్టర్లో పంచుకోవడంతో వైరల్ గా మారిపోయింది. ఆమె కోసం బాస్కెట్బాల్ జట్టు వెతుకుతుంది అంటూ ఒక సరదా వ్యాఖ్య జోడించారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: