సాధారణంగా చేపలు పట్టడాన్ని కొందరు సరదా కోసం చేస్తూ ఉంటే.. ఇంకొక మంది బతుకు బండి నడిపేందుకు చేపల వేట కొనసాగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కరు చేపలు పట్టడం విషయంలో ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది పొడవాటి కర్రకు ఒక ఎరను వేసి.. ఇక నీటిలో అది వేసి చేపలు పట్టడం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఒక వలవేసి ఏకంగా నీటిలోకి దికి చేపలు పట్టడం చేస్తూ ఉంటారు. అయితే ఎలా చేపలు పట్టిన ఇలా చేపలు పట్టడానికి వెళ్లిన సమయంలో మాత్రం భారీ చేప పడితే వారి సంతోషానికి అవధులు ఉండవు.


 ఈ క్రమంలోనే వలలో భారీ చేపలు పడి ఇక మత్స్యకారుల పంట పండిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి తరహా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలాంటివి మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు చేపలు పట్టడం కోసం వేసిన వలలో పాములు చిక్కడం లాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. చేపల వేటకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా వల బరువెక్కింది. దీంతో భారీ చాప పడిందని ఆ మత్స్యకారులందరూ కూడా ఎంతగానో సంతోష పడిపోయారు.


 వెంటనే ఆ చేపల వల బయటకి లాగి చూసారు. కానీ ఆ వలలో కనిపించింది చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ చేపల వలలో కనిపించింది పెద్ద చేప కాదు ఏకంగా ఒక భారీ మొసలి. ఉత్తరప్రదేశ్ లోని భారా బంకీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులు రోజు మాదిరిగానే ఇటీవల చేపలు పట్టేందుకు నమ్మ తలాబ్ చెరువులోకి వెళ్లారు. యధావిధిగానే వలవేసివేసి చూశారు. ఒక్కసారిగా వల బరువుగా మారడంతో వెంటనే ఒడ్డుకు లాగి చూసారు. కానీ అందులో ఒక భారీ మొసలి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనేఆ మొసలిని నీళ్లలోకి వదిలేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: