
కష్టానికి
తగ్గ ప్రతిఫలం అడగటంలో తప్పులేదు కష్టాన్ని దోచేస్తున్న సమయంలో ఎదురు తిరగడంలో
కూడా తప్పులేదు..దోపిడీ చేసిన వారిని నిలదీయడంలో కూడా తప్పులేదు అలా చేయకపోతే ఆ
ప్రతిఫలం కష్టం రెండూ వృధానే అవుతాయి..అయితే ఇదే తరహా పరిస్థితి ఆసియా గేమ్స్ లో
స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి సుధా సింగ్ కి ఎదురయ్యింది..అంతేకాదు యూపీ సీఎం
యోగి ఆదిత్యానాద్ కి దిమ్మతిగిపోయే షాక్ ఇచ్చింది..వివరాలలోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా రూ.30లక్షల చెక్ తీసుకునేందుకు ఆసియా గేమ్స్లో అథ్లెట్ సుధాసింగ్ స్వర్ణం సాధింఛి స్టీపుల్ఛేజ్లో తొమ్మిది సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచినా సుధా సింగ్ నిరాకరించింది..ఆసియా గేమ్స్ పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలతో సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం లక్నోలో క్రీడాకారులకు చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో సుధా సింగ్ తొలుత చెక్ తీసుకునేందుకు నిరాకరించారు.
అంతేకాదు తనకి రూ.30 లక్షలు వద్దని..ప్రభుత్వ ఉద్యోగం కావాలని సీఎం యోగని కోరారు..వరకు ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ తర్వాత ఆమె చెక్ను ఆయన చేతుల మీదుగా అందుకున్నారు..భారత దేశం పేరు ప్రపంచం అంతటా వినిపించేలా చేసిన సుధా సింగ్ కి యూపీ స్పోర్ట్స్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ పదవి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్ తీసుకోవడానికి నిరాకరించి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు...దాంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడాని యోగి ఒప్పుకోవడంతో మళ్ళీ సభాస్థలికి వచ్చారు..