అలనాటి అందాల నటి అతిలోక సుందరి శ్రీదేవి గురించి పరిచయం అవసరం లేదు.. అంతలా తన అందం మరియు నటనతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ లో నటించి స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా చేసింది. అయితే ఇప్పుడు ఆమె నట వారసులు జాన్వి కపూర్ మరియు ఖుషి కపూర్ లు హీరోయిన్ లుగా రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా పెద్దమ్మాయి జాన్వికపూర్ అయితే ఇంకా అరడజను సినిమాలైనా చేయక ముందే తన అందంతో ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. రోజూ ఏదో ఒక అప్డేట్ తో తన ఫ్యాన్స్ ను గిలిగింతలు పెడుతూ ఉంటుంది. అయితే తాను మొదట నటించిన దఢక్ చిత్రం ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేదు.

అందుకే తన తర్వాత సినిమా గుడ్ లక్ జెర్రీ పైనే తన ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన కొలమావు కోకిల కు రీమేక్ అని తెలిసిందే . దీనికి సిద్దార్ధ్ సేన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తాను తనకు కాబోయే భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ నాకు కాబోయే భర్త మంచి ప్రతిభావంతుడు అయి ఉండాలి.. సెన్స్ అఫ్ హ్యూమర్ ఉండాలి... లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. రోజూ నాలో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండాలి, రోజూ అతని నుండి నేను నేర్చుకునే విషయం  ఒకటి ఉండాలి. నేను సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అంటూ తన కలల రాకుమారుడి గురించి చెప్పుకొచ్చింది. మరి ఝాన్వి కపూర్ తన కాబోయే భర్త కోసం కన్న కలలు అన్నీ నిజ అవుతాయా ? భవిష్యత్తులో ఎలాంటి భర్త రానున్నాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: