ప్రముఖ బైక్స్ కంపెనీ యమహా మరో రెండు మోడళ్లను కూడా ఆవిష్కరించింది. అవి యమహా ఫాసినో ఇంకా యమహా రే-జెడ్ఆర్ స్కూటీస్. ఈ స్కూటీస్ చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ కొత్త స్కూటీలను త్వరలో షోరూమ్‌లలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు యమహా కంపెనీ తెలిపింది.ఇక త్వరలో రాబోతున్న ఈ యమహా స్కూటీస్ అప్‌డేటెడ్ డిజైన్, ఫీచర్స్ ఇంకా కొత్త పెయింట్ స్కీమ్‌తో కంపెనీ పరిచయం చేసింది. ఈ స్కూటీస్ లో కంపెనీ కొత్త స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్ అందించింది. ఇక అంతేగాకుండా ఈ హెడ్‌లైట్ లోపల ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఇవ్వబడింది. ఇక దీని టెయిల్ లైట్ డిజైన్ మరింత స్టైలిష్ గా అప్ డేట్ అయ్యింది.

స్కూటీ రెండు వైపులా సైడ్ ప్యానెల్స్‌పై 3 డి ఫాసినో లోగో ఇవ్వబడింది. ఇక కొత్త ఫాసినో ఇప్పుడు మొత్తం 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇక స్కూటీ బలాన్ని మెరుగుపరుస్తూ, కంపెనీ ఫాసినో మెటల్ ఫ్రంట్ ఆప్రాన్ ఇంకా మడ్‌గార్డ్‌ను తయారు చేసింది. ఇది కాకుండా, ఇప్పుడు 110 మిమీ విస్తృత బ్యాక్ టైర్‌ను పొందుతుంది.యమహా ఫాసినో ఇంకా రే-జెడ్ఆర్ 125 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ద్వారా 8.2 బిహెచ్‌పి పవర్ ఇంకా 9.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కొత్త స్కూటీలలో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉపయోగించబడింది. కాబట్టి ఇప్పుడు స్కూటీ ఎటువంటి శబ్దం రాకుండానే ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు చాలా కొత్త బైక్‌లు ఇంకా అలాగే స్కూటర్లలో ఇవ్వబడుతోంది.

అయితే ప్రస్తుతం కంపెనీ మాత్రం ఈ రెండు స్కూటీల ధరను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ కొత్త స్కూటీలు కొన్ని వారాల్లో యమహా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచబడతాయి.ఇక అప్పుడు ధరలు నిర్ణయించబడతాయి.ఇండియాలో, ఈ రెండు స్కూటీలు సుజుకి యాక్సెస్ 125, టివిఎస్ ఎన్ టార్క్ 125 మరియు హోండా యాక్టివా 125 వంటి వాటికీ గట్టి పోటీగా నిలిచి సూపర్ స్టైలిష్ స్కూటీలుగా మారడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: