జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ (పీడీపీ) అధినేత్రి​ మెహబూబా ముఫ్తీ విడుదల కోరుతూ మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ. తాజాగా హెబియస్​ కార్పస్​ రిట్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవటాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పిటిషన్​ దాఖలు చేసినట్లు చెప్పారు.

విడుదల చేస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు అనే పలు నిబంధనల బాండ్​పై సంతకం చేయలేదనే కారణంగానే తన తల్లిని నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు ఇల్తిజా.జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసింది కేంద్రం. దానికి ముందు రోజు మెహబూబా ముఫ్తీని నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత పీఎస్​ఏ చట్టాన్ని అమలు చేసి.. నిర్బంధాన్ని కొనసాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: