జమ్ముకశ్మీర్​ విలీన దినోత్సవాన్ని నిర్వహించింది స్థానిక భారతీయ జనతా పార్టీ విభాగం. కశ్మీర్​ను భారత్​లో విలీనం చేసేందుకు మహారాజా హరిసింగ్​ 1947, అక్టోబర్​ 26న సంతకం చేయడాన్ని పురస్కరించుకుని నిర్వహించినట్లు బిజేపి తెలిపింది. పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించింది.ఈ క్రమంలోనే.. జమ్ముకశ్మీర్​ జెండా తమ చేతికి తిరిగి వచ్చే వరకు ఏ జెండాను ఎత్తబోమని పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొనటంపై నిరసన వ్యక్తం చేసింది బిజేపి.


జమ్మూలోని పీడీపీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి.. జాతీయ పతాకాన్ని ఎగరేశారు బిజేపి కార్యకర్తలు. భారత్​ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.శ్రీనగర్​లోని క్లాక్​ టవర్​ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు బిజేపి కార్యకర్తలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పలువురు బిజేపి కార్యకర్తలను అరెస్ట్​ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: