ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కాస్త దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. కాసేపటి క్రితం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటించి నిర్ణయమే మా నిర్ణయం.. పార్టీ నిర్ణయం అని ఆయన స్పష్టం చేసారు. దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నానికి పర్యాటక రంగంగా ఎంతో, ప్రాముఖ్యత ఉంది అని తెలిపారు.

చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదు అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రాజెక్టుల మంజూరు చేసిన వాటిని రోజు పరిశీలిస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp