ప్రశాంత్ కిశోర్ సర్వే, ఇతర సర్వేల్లోను జగన్ గెలవలేడని తెలియడంతోనే వైకాపా నాయకులకు పిచ్చెక్కిందంటున్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. ఒక్కసారిగా 175 నియోజకవర్గాల్లోని తెలుగుదేశం కార్యకర్తలందరూ రోడ్డుపైకి వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి 600 మంది పోలీసులుంటే గానీ జగన్‌ బయటకు రాలేరని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం తోక ముడవాల్సిందేనని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెదేపాకు బలమైన కార్యకర్తలున్నారని.. వైసీపీ గూండాలు, రౌడీలు, పెయిడ్ ఆర్టిస్టుల్లాంటి పెయిడ్ గూండాలకు  కార్యకర్తలు భయపడద్దొన్నారు. ఇన్నాళ్లు ఓపికతో ఉన్న పార్టీ లక్షాలాదిమంది కార్యకర్తలు రోడ్డెక్కితే పోలీసులు, సీఐడీ శాఖ కంట్రోల్ చేయగలరా అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: