దేశంలో కలకలం సృష్టిస్తున్న మహిళ రెజ్లర్ల ఆందోళనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.


కష్టపడి, నిబద్ధతతో మరియు దేశభక్తితో మహిళా రెజ్లర్లు ప్రపంచానికి భారత దేశ ప్రతిభను కనబరిచారని..  దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం  తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ నిందితుడు బయట తిరుగుతున్నాడని,  దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా చూస్తోందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత .. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానాన్ని కోరుకుంటున్నారని.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: