ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలుసిందే. అటు నెల్లూరు జిల్లాలో కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువ అవుతూ కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉంది హాస్పిటల్ లో చికిత్స ఎలా అందిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులోని కరోనా  హాస్పిటల్ లో ఉన్న పేషంట్ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అందుతున్న చికిత్స గురించి.. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: