ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మన సంకల్పం సంక్షోభం కంటే గొప్పదని అన్నారు. ప్రస్తుతం చాలా కీలకమైన దశలో ఉన్నామని వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో భారత్ సత్తా ఏంటో ప్రపంచం చూస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ స్వయం సమృద్ధి, ఆర్థిక నిర్మాణానికి ఉపయోగపడుతుందని అన్నారు. 
 
 
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మోదీ ఈ ప్యాకేజ్ ను ప్రకటించారు. దేశ జీడీపీలో 10 శాతం ఈ ప్యాకేజీ అని పేర్కొన్నారు. వివిధ వర్గాలకు ఆర్థికంగా ఈ ప్యాకేజ్ ఉపయోగపడుతుందని వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయగలమన్న నమ్మకం ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: